ఎపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కార్యాలయం ప్రారంభం


ఎపీఎస్ఆర్టీసీ  రిజర్వేషన్ కార్యాలయం విశాఖ ద్వారకా బస్ స్టేషన్ లో  ప్రారంభం జరిగింది.   కార్యాలయాన్ని  ఎపీఎస్ఆర్టీసీ విజయనగరం ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ రవి కుమార్ గారు ప్రారంభించారు . ఈ సందర్భముగా రవి కుమార్ గారు మట్లాడుతూ- "ఈ కార్యాలయం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని పార్వతీపురం, సాలూరు, విజయనగరం, శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస లతో పాటు వివిద ప్రాంతాలకు అడ్వాన్స్ రిజర్వేషన్ మరియు కరెంట్ బుకింగ్ సౌకర్యం కూడా కల్పించబడినదని, ప్రయాణీకులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొనవలసినదిగా కోరారు . ఈ కార్యక్రమంలో ఎపీఎస్ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ ఎం.వై దానం, డివిజనల్ మేనేజర్లు ఎం.సుధాబిందు, కె.వెంకట్రావు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్లు బి.అప్పలనాయుడు, సి.హెచ్. అప్పల నారాయణ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.